ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram Pothineni) హీరోగా ప్రస్తుతం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Taluka) అనే సినిమా రూపొందుతుంది. మహేష్ బాబు .పి (Mahesh Babu.P) ఈ చిత్రానికి దర్శకుడు. రెండు, మూడు షెడ్యూల్స్ షూటింగ్ కూడా జరిగింది. ఇందులో ఉపేంద్ర (Upendra) కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఎక్కువ భాగం షూటింగ్ నిర్వహిస్తున్నారు. సినిమా నేపథ్యంలో సాగే కథ ఇది. గ్లింప్స్ తో ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు.
‘ది వారియర్’ (The Warriorr) ‘స్కంద’ (Skanda) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double iSmart) వంటి ప్లాపులతో రామ్ కొంచెం రేసులో వెనుకబడ్డాడు. ఇప్పుడు అతనికి ఓ సక్సెస్ కావాలి. మహేష్ బాబు.పి (Mahesh Babu.P) ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) తో మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఫామ్లో ఉన్నాడు. కాబట్టి.. రామ్ కి హిట్ ఇస్తాడు అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.
ఇదిలా ఉండగా.. మరోవైపు రామ్ నిర్మాతగా మారనున్నాడు అనేది లేటెస్ట్ న్యూస్. అతని పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ ఆల్రెడీ పెద్ద నిర్మాత. అతని బ్యానర్లోనే రామ్ ఎక్కువ సినిమాలు చేస్తుంటాడు. ఈ బ్యానర్లో రామ్ (Ram Pothineni) చేసిన సినిమాల్లో చాలా వరకు హిట్లు ఉన్నాయి. తన పెదనాన్న బ్యానర్లో సినిమాలు చేయడం తనకు చాలా కంఫర్ట్ గా ఉంటుందని రామ్ గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
మరి ఇప్పుడు రామ్ (Ram Pothineni) నిర్మాతగా మారాల్సిన అవసరం ఏముంది. బహుశా స్రవంతి మూవీస్ అనేది పెద్ద బ్యానర్ కాబట్టి.. సొంతంగా బ్యానర్ పెట్టి చిన్న సైజ్ సినిమాలు చేయాలనుకుంటున్నాడేమో. ఇక రామ్ నిర్మించబోయే మొదటి సినిమాతో ఓ కొత్త కుర్రాడు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తాడట. అయితే ఈ ప్రాజెక్ట్ కి రామ్ పూర్తిస్థాయి నిర్మాతగా ఉంటాడా? లేక సహా నిర్మాతగా వ్యవహరిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.