విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా ‘కింగ్డమ్’ (Kingdom) రూపొందింది.’జెర్సీ’ (Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) దర్శకత్వం వహించిన సినిమా ఇది. ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse) ఇందులో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వరుస ప్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ.. కచ్చితంగా ఈ సినిమాతో హిట్టు కొట్టి.. ఫామ్లోకి వస్తాడు అని అంతా భావిస్తున్నారు.
అతని లుక్ కూడా కొత్తగా ఉంది. అయితే మార్చి 28నే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని మొదట ప్రకటించారు. కానీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కోసం పోస్ట్ పోన్ చేశారు. కానీ ‘హరిహర వీరమల్లు’ కూడా ఆ డేట్ కి రాలేదు. తర్వాత మే 31 కి ‘కింగ్డమ్’ (Kingdom) అన్నారు. తర్వాత ‘హరిహర వీరమల్లు’ కోసం ఆ డేట్ కూడా వదులుకుంటున్నట్టు తెలిపారు. తర్వాత జూలై 4 అన్నారు. అప్పుడు కూడా సేమ్ రీజన్ అంటున్నారు.
ఫైనల్ గా జూలై 25 కోసం చూస్తున్నాం అన్నారు. మళ్ళీ అదే డేట్ కి ‘హరిహర వీరమల్లు’ కోసం వదులుతున్నాం అంటున్నారు.ఈ తంతు పవన్ (Pawan Kalyan), విజయ్ (Vijay Deverakonda) అభిమానులను మాత్రమే కాదు రవితేజ (Ravi Teja) అభిమానులకి కూడా నచ్చడం లేదు. ఎందుకంటే ‘కింగ్డమ్’ రిలీజ్ అయితేనే కానీ ‘మాస్ జాతర’ రిలీజ్ పనులు అంటే ప్రమోషన్స్ మొదలుకావు.
ఎందుకంటే.. ఈ 2 సినిమాలకి నాగవంశీనే నిర్మాత. ‘మాస్ జాతర’ (Mass Jathara) ని ఆగస్టు 27 కి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ‘కింగ్డమ్’ ఆగస్టు మొదటి వారానికి వెళ్తే.. అదే నెలలో ‘మాస్ జాతర’ ని నాగవంశీ (Naga Vamsi) రిలీజ్ చేస్తారనేది డౌటే. అందుకే రవితేజ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది.