Kota Srinivasa Rao: డబ్బా పాలు అంటూ కోటా శ్రీనివాసరావు కామెంట్స్ వైరల్.!
- May 23, 2024 / 08:45 PM ISTByFilmy Focus
టాలీవుడ్ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఎంత అద్భుతమైన నటుడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో విలక్షణమైన పాత్రలను ఆయన అవలీలగా పోషించారు. వయసు మీద పడటంతో ఇప్పుడు కోటాకి అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. ఈ ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడే మాటలు కూడా వివాదాస్పదమవుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కోటా శ్రీనివాసరావు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊహించని కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు.

ముఖ్యంగా బాపు- రమణ..ల గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. “ఒకసారి నేను బాపు సినిమాలో ఎంపికయ్యాను. మొదటి రోజు షూటింగ్లో రమణ నా పక్కనే ఉన్నారు. ఆ టైంలో నేను డైలాగ్ చెప్పలేకపోతున్నాను. నేను ఇబ్బంది పడటం చూసిన రమణగారు నన్ను పిలిచారు. అప్పుడు నాకు కంగారు వచ్చింది. అప్పుడు ఆయన నాతో ఇలా అన్నారు. ‘నాతో పాటు బాపు కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు.

మేము.. నీ ఫ్యాన్సయ్యా ‘ అని అన్నారు. ఆయన మాట విన్నాక నాకు కళ్లంటా నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత ‘పద్మశ్రీ’ వచ్చినంత ఆనందమేసింది. బాపు గారి గురించి చెప్పాలంటే.. ‘తెలుగు చూడాలంటే బాపు .. తెలుగు వినాలంటే రమణ’ అని అన్నాను.ఆయన సినిమాల్లో హాస్యం ఇప్పటికీ బాగా అనిపిస్తుంది. అది నిజమైన హాస్యం .. ఇప్పుడున్నది కామెడీ. ఆ హాస్యం తల్లిపాలలాంటిది. ఇప్పుడున్న హాస్యం డబ్బా పాల వంటిది” అంటూ చెప్పుకొచ్చారు.














