Vishnu Vardhan: నేను, మహేష్ బాబు ఫేక్ క్వశ్చన్ పేపర్స్ కొన్నాం : పంజా దర్శకుడు విష్ణువర్ధన్
- January 30, 2025 / 02:04 PM ISTByPhani Kumar
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే అనే సంగతి తెలిసిందే. 20 ఏళ్ళ వరకు అతను చెన్నైలోనే ఎక్కువగా గడిపాడు. ఈ విషయాన్ని అతనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ.. మహేష్ బాబుకి క్లాస్ మేట్ అనే సంగతి కూడా చాలా మందికి తెలుసు. అంతేకాదు కోదండరామిరెడ్డి కొడుకు గౌతమ్ కూడా మహేష్ కి క్లాస్మేట్. అలాగే పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) ‘పంజా’ (Panjaa) అనే సినిమా తీసిన దర్శకుడు విష్ణువర్ధన్ (Vishnu vardhan) కూడా మహేష్ బాబు క్లాస్మేట్ అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
Vishnu Vardhan

ఇక విష్ణువర్ధన్ (Vishnu Vardhan) ‘నెసిప్పాయ’ సినిమాని ‘ప్రేమిస్తావా’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అతను హైదరాబాద్ వచ్చాడు. జనవరి 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విష్ణువర్ధన్ ఓ ఛానల్ తో మాట్లాడుతూ.. ” నేను, మహేష్ బాబు గారు క్లాస్ మేట్స్. చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది.

మేము చదువుకునే రోజుల్లో ఎక్కడో క్వెశ్చన్ పేపర్ అమ్ముతున్నారు అంటే.. మేము బైక్ పై వెళ్లి కొనుక్కుని తెచ్చుకున్నాం. కట్ చేస్తే అది ఫేక్ క్వశ్చన్ పేపర్. అందువల్ల నేను ఫెయిల్ అయ్యాను. మహేష్ గారు అయితే పాస్ అయినట్టు ఉన్నారు. ‘మహేష్ గారు.. నన్ను క్షమించండి ఈ విషయాన్ని బయటపెట్టినందుకు’ ” అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు విష్ణువర్ధన్.
Nenu mahesh Gaaru classmates Chinnappudu Question papers ammesevallam…
~ Director #VishnuVardhan #MaheshBabu pic.twitter.com/WhnD0QEAEO— Karthikkk_7 (@Karthikuuu7) January 29, 2025













