అదేంటో గానీ అటు రాజమౌళి (Rajamouli) , ఇటు మహేష్ బాబు (Mahesh Babu) తమ కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా వాళ్లేం చేస్తున్నారు అనే విషయం ఆటోమేటిగ్గా తెలిసిపోతోంది. కావాలంటే మీరే చూసుకోండి.. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి వచ్చిన ఏ సమాచారమూ టీమ్ నుండి అధికారికంగా బయటకు రాలేదు. అలా అని వాటిని లీకులు అని కూడా అనలేం. ప్రాజెక్ట్కి నేరుగా సంబంధం లేని వాళ్లు సినిమా విషయాలను చెప్పుకొచ్చారు.
అలా ఇప్పుడు ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కు సంబంధించి ఓ విషయం బయటకు వచ్చింది. గతంలో చెప్పినట్లు మహేష్బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ #SSMB29 అని పిలుచుకుంటున్న ప్రాజెక్ట్.. రాజమౌళి ఫ్యాన్స్ #SSRMB అని పిలుచుకుంటున్న ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. అయితే ఎక్కడా ఏం చేస్తున్నారు అనేది చెప్పడం లేదు. అయితే ఈ సినిమా ఎక్కువగా ఒడిశా నేపథ్యంలో సాగుతుంది అని మాత్రం అర్థమవుతోంది. ఆ మధ్య ఒడిశాలోని ఓ పర్వతప్రాంతంలో సినిమా షూటింగ్ చేపట్టారు.
ఇప్పుడు ఏకంగా ఆ సినిమాలో ఓ హీరోయిన్ ఒడిశా ప్రత్యేక నృత్యంలో శిక్షణ తీసుకుంది. మహేష్ బాబు (Mahesh Babu) – రాజమౌళి (Rajamouli) – పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ నాయికగా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక ప్రత్యేకంగా మయూర్ భంజ్ ఛౌ అనే నృత్యాన్ని నేర్చుకుంది.. ఈ నృత్యంలో ప్రసిద్ధి చెందిన ఒడిశా కళాకారుడు విక్కీ భర్తియ ఆధ్వర్యంలో ప్రియాంక చోప్రా శిక్షణ తీసుకుంది.
ఈ నేపథ్యంలో ప్రియాంక కలిసి పని చేసిన అనుభవాన్ని వివరిస్తూ కొరియోగ్రాఫర్ విక్కీ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రియాంక పనిచేయడం ప్రత్యేక అనుభవం. ఆమె మాతో చాలా సరదాగా ఉండేది. అందరితో ఆప్యాయంగా మెలిగింది. డ్యాన్స్ రిహార్సల్స్, చిత్రీకరణ సమయంలో ఆమె ఎనర్జీ చూసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఈ శిక్షణ ప్రయాణంలో నేనూ ఒక భాగమైనందుకు కృతజ్ఞుడును అని విక్కీ రాసుకొచ్చారు. దీంతో మహేష్ (Mahesh Babu) – రాజమౌళి (Rajamouli) సినిమా కోసం ప్రియాంక ఈ నృత్యంలో శిక్షణ తీసుకుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.