Puri Jagannadh: సక్సెస్ లేని హీరోతో మళ్ళీ కలిసిన పూరి!
- February 16, 2025 / 08:00 AM ISTByFilmy Focus Desk
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఇప్పుడు ఏం చేస్తాడు అన్నదానిపై సినీ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత పూరి మరో కొత్త ప్రాజెక్ట్పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఈసారి ఫామ్లో ఉన్న స్టార్ హీరోలతో సినిమా చేయబోవడం లేదని టాక్. తాజాగా అతను గోపీచంద్తో ఓ మాస్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల పూరి, గోపీచంద్ (Gopichand) కోసం ఓ కథపై చర్చలు జరిపినట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది.
Puri Jagannadh

కథ ఓకే కావడంతో ఈ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. మే నెల తర్వాత ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశముందని టాక్. ఆసక్తికరంగా, ఈ సినిమాకి పూరి కేవలం స్టోరీ, డైలాగ్స్ మాత్రమే అందిస్తాడని, స్క్రీన్ప్లే విషయంలో మాత్రం పాత స్టైల్ను ఫాలో అవుతాడని చెబుతున్నారు. గతంలో ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar), లైగర్ (Liger) వంటి సినిమాలకు స్క్రీన్ప్లే రాసిన పూరి, ఈసారి పూర్తిగా డైరెక్షన్ మీదే ఫోకస్ పెట్టనున్నాడట.

ఇక గోపీచంద్ కెరీర్ విషయానికి వస్తే, ఆయన గత కొంతకాలంగా సరైన హిట్ లేక వెనుకబడ్డాడు. సీటీమార్ (Seetimaarr), రామబాణం (Ramabanam) వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఇప్పుడు కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉన్నారు. సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) దర్శకత్వంలో శ్రీనివాస్ చుట్టూరి నిర్మాణంలో మరో సినిమా సెట్ అయిందనే టాక్ ఉంది.

అంటే, గోపీచంద్ వరుసగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశముంది. గోపీచంద్కి మళ్లీ సక్సెస్ రావాలంటే కచ్చితంగా ఓ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ అవసరం. మరి, పూరి కాంబోలో ఈ సినిమా గోపీచంద్ కెరీర్కు మళ్లీ బూస్ట్ ఇస్తుందా? అనేది చూడాలి.

















