ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘శబ్దం’ (Sabdham. అరివళగన్ (Arivazhagan Venkatachalam) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ (S.S.Thaman) సంగీతం అందించాడు. 14 ఏళ్ళ క్రితం ఇదే కాంబినేషన్లో ‘వైశాలి’ అనే సినిమా వచ్చింది. దీంతో ‘శబ్దం’ పై కూడా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దృష్టి పడింది. పైగా ఇది హారర్ జోనర్ మూవీ. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ కి కూడా మంచి స్పందన వచ్చింది. తెలుగులో ‘మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ’ రిలీజ్ చేసింది. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది.
కానీ ఓపెనింగ్స్ మాత్రం సో సోగానే వచ్చాయి. రెండో రోజు కూడా పర్వాలేదు అనిపించింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.21 cr |
సీడెడ్ | 0.09 cr |
ఆంధ్ర(టోటల్) | 0.22 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.52 cr |
‘శబ్దం’ సినిమాకి తెలుగులో రూ.1.20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే 2 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.0.52 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.0.86 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.98 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆదివారం కూడా ఈ సినిమా డీసెంట్ గా కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.