‘SSMB29’ లో అతి ముఖ్యమైన పాత్ర కోసం చియాన్ విక్రమ్ ను (Vikram) కూడా తీసుకున్నారు. కానీ ఎందుకో విక్రమ్ ఈ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తి చూపడం లేదు. రాజమౌళికి (S. S. Rajamouli) అనే కాదు తెలుగు దర్శకులంటే విక్రమ్.. చులకన భావనతో ఉంటాడనే టాక్ కూడా ఉంది. విక్రమ్ ను ఇక బ్రతిమాలి పని అయితే జక్కన్న పెట్టుకోలేదు. మాధవన్ ను (R.Madhavan) అప్రోచ్ అయ్యాడు. ఈ ప్రాజెక్టులో మాధవన్ దాదాపు ఖరారైనట్లే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
అధికారిక ప్రకటనలు వంటివి ఇచ్చే పనిలో ఇప్పుడు రాజమౌళి లేడు. పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran), ప్రియాంక చోప్రా (Priyanka Chopra). వంటి స్టార్లు కీలక పాత్రలకు ఎంపికైనా.. ఎటువంటి అధికారిక ప్రకటన ఇచ్చింది లేదు. ఇప్పుడు మాధవన్ విషయంలో కూడా అంతే ఉండవచ్చు. షూటింగ్ స్పాట్ లో మాధవన్ కి సంబంధించి ఫోటో వస్తే.. చాలు మిగిలింది సోషల్ మీడియా చూసుకుంటుంది.
ఇదిలా ఉండగా.. మహేష్ బాబు (Mahesh Babu) నటించిన ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా కోసం కూడా మాధవన్ ను సంప్రదించారు. అయితే తర్వాత స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోవడంతో మాధవన్ పాత్రని సైడ్ చేసినట్లు అప్పట్లో టాక్ నడిచింది. తర్వాత విలన్ గా సముద్రఖనిని (Samuthirakani) తీసుకుని షూటింగ్ ఫినిష్ చేశారు.
మొత్తానికి అప్పుడు మిస్ అయిన కాంబోని ఇప్పుడు రాజమౌళి సెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 2 కీలక షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. షూటింగ్ కు రాజమౌళి కొంత గ్యాప్ ఇచ్చారు. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కావచ్చు.