Samantha: నిర్మాతగా సామ్ ప్రాఫిట్స్ లోకి వచ్చినట్లేనా?
- May 7, 2025 / 08:55 PM ISTByFilmy Focus Desk
సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) నిర్మాతగా తన రెండో ప్రయత్నంలో సక్సెస్ ట్రాక్పై నడుస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో ‘యూ టర్న్’ సినిమాతో నిర్మాతగా మొదలుపెట్టిన సమంత, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా, ఇప్పుడు ‘శుభం’ (Subham) సినిమాతో మళ్లీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. మే 9న విడుదల కానున్న ఈ కామెడీ థ్రిల్లర్, రిలీజ్కు ముందే నాన్ థియేట్రికల్ డీల్స్తో టేబుల్ ప్రాఫిట్ సాధించినట్లు టాక్. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత నిర్మించిన ‘శుభం’, ప్రవీణ్ కాండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వంలో రూపొందింది.
Samantha

సమంత ఈ సినిమాలో మతాజీ పాత్రలో కీలక కామియో చేస్తూ, నిర్మాతగా తన సామర్థ్యాన్ని చాటుతోంది. ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సమంత కూడా ప్రమోషన్స్లో చురుగ్గా పాల్గొంటూ, సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ డీల్స్ ద్వారా భారీ లాభాల దిశగా సాగుతోంది. జీ గ్రూప్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకోగా, నెట్ఫ్లిక్స్తో ఓటీటీ డీల్స్ కూడా దాదాపు ఖరారైనట్లు సమాచారం.
ఈ రెండు డీల్స్తోనే సినిమా బడ్జెట్ను రికవరీ చేసుకుని, టేబుల్ ప్రాఫిట్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన సమంత నిర్మాతగా తొలి సక్సెస్ను ‘శుభం’తో అందుకున్నట్లు అయింది. ‘శుభం’ కథ 2004లో భీమునిపట్నం నేపథ్యంలో జరుగుతుంది. ముగ్గురు స్నేహితుల భార్యలు టీవీ సీరియల్కు అడిక్ట్ అవడం, ఆ తర్వాత వారు దెయ్యాలు పట్టినట్లు ప్రవర్తించడం చుట్టూ కథ నడుస్తుంది.

ఈ సమస్య నుంచి బయటపడేందుకు సమంత మతాజీ పాత్రలో సాయం చేస్తుంది. హర్షిత్ రెడ్డి (Harshith Reddy), శ్రీయ కొంతం (Shriya Kottam), చరణ్ పేరి (Charan Peri), శాలిని కొండేపూడి (Shalini Kondepudi) నటిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.












