సీఎం రేవంత్ తో చర్చలకు సిద్ధమైన టాలీవుడ్.. నాగవంశీ ఏమన్నారంటే!
- December 24, 2024 / 10:28 AM ISTByFilmy Focus Desk
సంధ్య థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర ఘటన సినీ పరిశ్రమలో ఒక్కసారిగా అలజడిని క్రియేట్ చేసింది. ముఖ్యంగా సినిమా థియేటర్లలో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇక తెలంగాణా ప్రభుత్వం సీరియస్ కావడంతో టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కావాలని భావిస్తున్నారు. నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ అంశంపై మాట్లాడుతూ, ప్రస్తుతం (Tollywood) ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) అమెరికాలో ఉన్నారని, ఆయన రాగానే ముఖ్యమంత్రిని కలిసి చర్చలు ప్రారంభిస్తామని తెలిపారు.
Tollywood

ఈ సమావేశంలో టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు, థియేటర్ భద్రత అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. ప్రత్యేకంగా సంక్రాంతి పండుగకు విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమాల టికెట్ రేట్లపై క్లారిటీ పొందేందుకు ప్రయత్నిస్తారని నాగవంశీ తెలిపారు. దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) , బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) , సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో ఈ చర్చలు కీలకంగా మారాయి.
తెలంగాణ సర్కారు తాజా నిర్ణయాలు టాలీవుడ్ను సవాళ్లమయంగా నిలిపాయి. ముఖ్యంగా బెనిఫిట్ షోలపై నిషేధం, టికెట్ రేట్ల పెంపు మంజూరులో ప్రభుత్వం తీసుకున్న కఠిన వైఖరి చిత్ర పరిశ్రమపై ప్రభావం చూపనుంది. ఈ విషయంలో నిర్మాతలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంక్రాంతి విడుదలలకు ముందే టికెట్ రేట్లు, షోల పరిమితులపై ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.

ఇంకా, నాగవంశీ ఆంధ్రప్రదేశ్కు ఇండస్ట్రీ (Tollywood) తరలింపుపై స్పందిస్తూ, హైదరాబాద్ సినీ పరిశ్రమకు కేంద్రంగా కొనసాగుతుందని స్పష్టంగా చెప్పారు. తనకు, ఇతర నిర్మాతలకు ఇప్పటికే ఇక్కడ భారీ పెట్టుబడులు ఉన్నాయని, మరొక ప్రాంతానికి వెళ్లే ఆలోచన లేదని తెలిపారు. ఏపీ సర్కారు నుంచి కొన్ని చలవలు ఉన్నప్పటికీ, హైదరాబాద్ ఇండస్ట్రీకి సరైన స్థలం అని అభిప్రాయపడ్డారు. ఇక సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలకు ఈ చర్చలు ఎంతవరకు ప్రయోజనకరమవుతాయో చూడాలి. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలను పునర్విమర్శిస్తుందా లేదా అనేది ఇప్పటికి స్పష్టత రాలేదు.













