Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను : మంచు విష్ణు
- June 21, 2025 / 04:23 PM ISTByPhani Kumar
టాలీవుడ్ హీరో, హీరోలకి కూడా ఓ కామన్ గ్రూప్ ఉంది. చాలా మందికి ఈ విషయం తెలిసుండకపోవచ్చు. గతంలో ఈ విషయాన్ని మంచు లక్ష్మి (Lakshmi Manchu), నాని (Nani), రానా (Rana Daggubati) వంటి వాళ్ళు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఆ గ్రూప్ లో ఫన్నీ డిస్కషన్స్ తో పాటు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను కూడా పంచుకుంటామని వారు చెప్పడం జరిగింది.
Manchu Vishnu
2015 లో రానా (Rana Daggubati) – బన్నీ (Allu Arjun) ఈ గ్రూప్ ను స్టార్ట్ చేసినట్టు టాక్ వినిపించింది. ఒక హెల్ది కన్వర్జేషన్స్ కోసం ఈ గ్రూప్ ను ప్రారంభించినట్టు కూడా కొంతమంది ఇండస్ట్రీ జనాలు చెప్పుకొచ్చారు. కానీ ఈ గ్రూప్ నుండి మంచు విష్ణు ఎగ్జిట్ అయిపోయాడట. ఇటీవల బాలీవుడ్లో నిర్వహించిన ‘కన్నప్ప’ (Kannappa) ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు.

- 1 Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’
- 2 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
- 3 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
- 4 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
- 5 Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!
మంచు విష్ణు (Manchu Vishnu ) ఈ విషయం పై మాట్లాడుతూ.. “రానా, బన్నీ… ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో దాదాపు 140 మంది హీరో, హీరోయిన్స్ ఉన్నారు. నేను కూడా ఆ గ్రూప్ లో ఉండేవాడిని. తర్వాత బయటకు వచ్చేశాను. ఎందుకంటే అందులో చాలా మంది హీరోయిన్స్ ఉంటారు. ఆ గ్రూప్ లో చాట్ చేయడానికి నాకు కొంచెం సిగ్గుగా అనిపించేది.

అందుకే ఆ వాట్సాప్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యాను. ఏదైనా చెప్పాలంటే.. దయచేసి నాకు పర్సనల్ గా మెసేజ్/కాల్ చేయమని రానా (Rana Daggubati), బన్నీ (Allu Arjun) కి చెప్పాను. మేమంతా కలిసే పెరిగాము. సో ఎటువంటి మొహమాటం ఉండదు. ఇప్పటికీ ఏదైనా డిస్కస్ చేయాలంటే .. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తారు” అంటూ చెప్పుకొచ్చాడు.

















