‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) సినిమాతో ప్రభాస్ (Prabhas) మామూలు హిట్ కొట్టలేదు, కెరీర్లోనే ఓ రేంజ్ బ్లాక్బస్టర్ పడింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) , దీపికా పదుకొణె(Deepika Padukone) , కమల్ హాసన్ (Kamal Haasan) లాంటి లెజెండరీ స్టార్స్ ఉండటంతో, అన్ని భాషల్లోనూ సినిమా ఇరగ్గొట్టేసింది. ఈ కథకు కచ్చితంగా మరో పార్ట్ ఉంటుందని, సీక్వెల్ ప్లానింగ్లో ఉందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ముందే క్లారిటీ ఇచ్చేశారు.
అనుకున్నట్లే, ఈ సీక్వెల్ షూటింగ్ ఈ ఏడాదే మొదలవ్వాల్సింది. ఇందుకోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆల్రెడీ బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, స్టన్నింగ్ బ్యూటీ దీపికా పదుకొణెల డేట్స్ కూడా లాక్ చేసేశారు. వాళ్లంతా ఈ ప్రాజెక్ట్ కోసం టైమ్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. అయితే, డార్లింగ్ ప్రభాస్ షెడ్యూల్ ఫుల్ బిజీ అయిపోవడంతో ఈ ప్రాజెక్టుకు చిక్కులు వచ్చి పడ్డాయి.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ముందుగా ‘ది రాజా సాబ్’ (The Rajasaab) సినిమాను కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత ‘ఫౌజీ’ లైన్లో ఉంది, సందీప్ రెడ్డి వంగాతో (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ (Spirit) కూడా ఉంది. ఇవన్నీ పూర్తయ్యాకే ‘కల్కి 2898 AD’ సీక్వెల్ సెట్స్ మీదకు వచ్చే ఛాన్స్ ఉంది. మరి డార్లింగ్ ఎప్పుడు ఫ్రీ అవుతారో, షూటింగ్కు ఎప్పుడు జాయిన్ అవుతారో ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదట.
ఈ అనిశ్చితితో డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాస్త అయోమయంలో పడ్డారని టాక్. అందుకే, ప్రస్తుతానికి సీక్వెల్ పనులను తాత్కాలికంగా హోల్డ్లో పెట్టారట. ఈ గ్యాప్లో ఆయన మరో రెండు కొత్త కథలపై వర్క్ చేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.